Site icon NTV Telugu

ప్రపంచంలో అతి పెద్ద ద్రోహి సీఎం కేసీఆర్ : రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వచ్చారు. అక్కడ ఆయన మాట్లాడుతూ… ఆయన ఆరోగ్యం కుదటపడింది. హాస్పిటల్ లో ఉన్న.. ప్రజా సమస్యలపై నాతో చర్చించారు. దళితుల విషయంలో వీహెచ్ చాలా కమిటెడ్ గా ఉన్నారు. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ చేస్తున్న ద్రోహం పై పోరాడాలని సూచించారు. ఈ ప్రపంచంలో అతి పెద్ద ద్రోహి సీఎం కేసీఆర్ అని తెలిపారు.

పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని చెప్పి.. తట్టెడు మట్టి తీయలేదు. దళిత ఎంపర్ మెంట్ అని కేవలం నియోజకవర్గానికి వంద కుటుంబాలకు సహాయం అనడం ద్రోహం. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. పార్టీ అభివృద్ధి విషయంలో కొన్ని సలహాలు ఇచ్చారు. మేడమ్ సోనియా గాంధీ వద్దకు స్వయంగా కలిసి వెళ్దామని చెప్పారు. వీహెచ్ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తా అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version