NTV Telugu Site icon

కేసీఆర్ గిరిజనులను అనాధలుగా చేశారు : రేవంత్ రెడ్డి

revanth reddy

గిరిజనులను అనాధలుగా చేశారు సీఎం కేసీఆర్. భూముల పై హక్కులు లేకుండా చేస్తుంది ప్రభుత్వం. సీలింగ్ యాక్ట్ తెచ్చి గడిల దగ్గర బందీ అయిన భూములను పేదలకు పంచింది కాంగ్రెస్ అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజన బిడ్డలు ఐఏఎస్..ఐపీఎస్ లు అయ్యే అవకాశం కాంగ్రెస్ కల్పించింది. కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్ లే గిరిజనుల కు అండ. రెండు పర్యాయాలు తెరాస కి అధికారం కట్టబెట్టి నా… గిరిజనుల హక్కులు లేకుండా పోయాయి. పోడు భూములు గుంజుకుని… నిర్వాసితులు చేస్తున్నారు. ప్రాజెక్టులు కట్టాలంటే దళితుల భూములు కావాలి.. మొక్కలు పెంచాలంటే గిరిజనుల భూములు లాక్కున్నారు కేసీఆర్ అని తెలిపారు.

దళిత బందు ఎవడు అడ్డుకుంటరో చూస్తా అని సీఎం అంటున్నారు. దళితుల కు 10 లక్షలు ఇస్త అంటే ఎవడు అడ్డోచ్చిండు. రాష్ట్ర మంతా దళితులకు 10 లక్షలు ఇవ్వు. నిధులు సరిపోకపోతే సెకరటేరియట్ భూములు… 10 ఏకరాల ప్రగతి భవన్ అమ్ముదాం అన్నారు. అసెంబ్లీ సమావేశం పెట్టీ… దళిత బందు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం అని తీర్మానం పెట్టు. మేము మద్దతు ఇవ్వడానికి సిద్దం. ఎవడో అడ్డుకుంటున్నారు అని తప్పించుకోవాలని చూస్తున్నారు కేసీఆర్ అని పేర్కొన్నారు.