Site icon NTV Telugu

టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల తేదీని పొడిగించిన TOSS

ఓపెన్ స్కూల్ సొసైటీ తెలంగాణలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. అయితే ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు రేపు ముగియనున్న నేపథ్యంలో గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో, వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేక పోయిన విద్యార్థులు పొడగించిన గడువు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) టెన్త్ మరియు ఇంటర్మీడియట్ కోర్సుల్లోకి ప్రత్యేక ప్రవేశాల కోసం చివరి తేదీని జనవరి 24 నుండి 31 వరకు పొడిగించింది. ప్రజా ప్రతినిధులు, అభ్యాసకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు ఇతర వాటాదారుల నుండి వచ్చిన అభ్యర్థనల దృష్ట్యా, ప్రత్యేక ప్రవేశాల కోసం చివరి తేదీని పొడిగించినట్లు TOSS ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత రుసుము మరియు ఆలస్య రుసుము చెల్లించి అడ్మిషన్లు తీసుకోవచ్చు.

Exit mobile version