తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 409 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 453 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,035 కు చేరగా.. రికవరీ కేసులు 6,43,318 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,852 గా ఉంది.. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 98.36 శాతంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,865 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 88,308 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని బులెటిన్లో పేర్కొంది సర్కార్.
తెలంగాణలో స్థిరంగా కరోనా కేసులు…
corona