Site icon NTV Telugu

తెలంగాణలో నేడు తగ్గిన కరోనా కేసులు…

corona

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ రోజువారి కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 73,899 సాంపిల్స్‌ పరీక్షించగా.. 359 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కోవిడ్‌ బాధితులు మృత్యువాతపడ్డారు.. ఇదే సమయంలో 494 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,54,394 కు చేరగా.. రికవరీ కేసులు 6,43,812 కు పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 3,854 కి పెరిగింది. తెలంగాణలో రికవరీ రేటు 98.38 శాతంగా ఉందని పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,728 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Exit mobile version