తెలంగాణలో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 23,888 శాంపిల్స్ పరీక్షించగా… 105 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈరోజు ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఇదే సమయంలో 106 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,574 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,65,861 కు పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 3,973 కు చేరినట్టు బులెటిన్లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,740 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. తాజా, కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 59 కొత్త కేసులు వెలుగు చూశాయి.
తెలంగాణ కరోనా అప్డేట్…
