NTV Telugu Site icon

తెలుగు అకాడమీలో అక్రమాలు.. ముగ్గురు సభ్యులతో కమిటీ

Telugu-Academy

Telugu-Academy

తెలుగు అకాడమీలో అక్రమాలు వెలుగుచూశాయి.. తెలుగు అకాడమీకి సంబంధించిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. వాటిని నిగ్గు తేల్చే పనిలో పడిపోయారు అధికారులు.. దాని కోసం ముగ్గురు సభ్యులతో కూడిన శాఖాపరమైన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి.. ఆ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 2వ తేదీలోగా ఈ కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపిన తెలుగు అకాడమీ డైరెక్టర్‌.. ఇప్పటికే తెలుగు అకాడమీ తరఫున సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని.. విచారణ కూడా ప్రారంభం అయినట్టు ప్రకటించారు.