Site icon NTV Telugu

సీబీఐ అధికారుల పేరుతో ఇంట్లో లూఠీ చేసిన దొంగలు.

గచ్చిబౌలి నానక్ రాంగూడలో ఓ ఘటన చోటు చేసింది. సీబీఐ అధికారులు పేరుతో… సోదాలు చేయాలంటూ ఇంటిని గుల్ల చేసారు దొంగలు. 1 కేజీల 44 గ్రాము ల బంగారంతో పాటు 2 లక్షల నగదు చోరీ చేసారు. గచ్చిబౌలి పీఎస్ పరిది నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జయభేరి ఆరెంజ్ కౌంటీలో ఉంటున్న భాగ్యలక్ష్మి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జయభేరి ఆరెంజ్ కౌంటి ప్లాట్ నెంబర్ 110 లో ఉంటున్నారు భాగ్యలక్ష్మి. అయితే ఆ ఇంటికి వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు.. సీబీఐ అధికారులమంటూ ఇంటి ఓనర్ భాగ్యలక్ష్మిని పరిచయం చేసుకున్నారు దుండగులు. దాదాపు గంటన్నర వరకు ఇంట్లో ఉన్న దుండగులు… లాకర్ కీస్ తీసుకుని 1 కేజీల 44 గ్రాముల బంగారంతో పాటు 2 లక్షల ఎత్తుకెళ్లారు దుండగులు.

Exit mobile version