NTV Telugu Site icon

భాగ్యనగర వాసులకు.. జలమండలి కీలక సూచనలు

భాగ్యనగర వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. తాగునీటికి సంబంధించి జలమండలి భాగ్యనగర వాసులకు కీలక సూచనలు చేసింది. హైద్రాబాద్‌ మహా నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా డ్రికింగ్‌ వాటర్‌సప్లై స్కీం(ఎండబ్యూ ఎస్‌ఎస్‌) ఫేజ్‌-2లో కలాబ్‌గుర్‌ నుంచి పటాన్ చెరువు వరకు 1500 ఎంఎండయాపీఎస్‌సీ పంపింగ్‌ మెయిన్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మత్తులు, కందిగ్రామం వద్ద జంక్షన్‌ పనులు చేపట్టనుంది. ఈ కారణంగా భాగ్యనగరంలో పలు చోట్ల వివిధ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగనుంది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఈ పనులు కొనసాగనున్నాయి.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు ఇవే:
ఓ అండ్‌ ఎమ్‌ డివిజన్‌ నెం.9 హైదర్‌నగర్‌, రాం నరేష్‌ నగర్‌, కేపీహెచ్‌బీ, భాగ్యనగర్‌, వసంత్‌నగర్‌, ఎస్‌పీ నగర్‌
ఓ అండ్‌ ఎమ్‌ డివిజన్‌ నెం.15 మియాపూర్‌, దీప్తినగర్‌, శ్రీనగర్‌, మాతృశ్రీనగర్‌, లక్మీనగర్‌, జేపీ నగర్‌, చందానగర్‌ తదితర ప్రాంతాలు
ఓ అండ్‌ ఎమ్‌ డివిజన్‌ నెం. 23 నిజాంపేట్‌, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్‌
ఓ అండ్‌ ఎమ్‌ డివిజన్‌ నెం.32 బొల్లారం ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ నగర వాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలని, హైదరాబాద్‌ జలమండలి మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.