Harish Rao: తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కారును పోలీసులు తనిఖీ చేశారు. సిద్దిపేట నుంచి మరోసారి బరిలోకి దిగిన హరీశ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి బయల్దేరారు. దారిలో హరీష్ రావు కారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నిబంధనల మేరకు మంత్రి హరీశ్ వాహనాన్ని పోలీసులు ఆపి విచారణ చేపట్టారు. హరీశ్రావు తన మద్దతుదారులు, బీఆర్ఎస్ నేతలతో కలిసి పోలీసులకు పూర్తిగా సహకరించారు. మంత్రి కారుతో పాటు ఆయన ప్రయాణిస్తున్న ఇతర వాహనాలను కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేశామని… అదే క్రమంలో మంత్రి కాన్వాయ్ని కూడా నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. సహకరించిన మంత్రికి పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల తనిఖీ అనంతరం మంత్రి కాన్వాయ్ కొండగట్టు ఆలయం వైపు వెళ్లింది. కొండగట్టు ఆంజనేయస్వామి చెంతకు నామినేషన్ పత్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
దర్శనానంతరం మంత్రి హరీశ్రావును ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. స్వామివారి ఆశీస్సులతో సిద్దిపేటలో మళ్లీ బంపర్ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని…బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, తాజాగా నిజామాబాద్లో సీఎం కేసీఆర్ కాన్వాయ్ను కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో జరుగుతున్న జన ఆశీర్వాద సభకు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో వెళ్లగా.. ఆయన కాన్వాయ్ రోడ్డు మార్గంలో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కాన్వాయ్లోని వాహనాలు నిజామాబాద్ మీదుగా హైదరాబాద్కు వస్తుండగా, నిరసన ప్రదేశంలో కేసీఆర్ కాన్వాయ్ తనిఖీ చేశారు. దీంతో పాటు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల వాహనాలను కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తారతమ్యం లేకుండా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసుకోవడంలో భాగంగానే ఈ విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
PM MODI: దీపావళికి దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి.. నమో యాప్లో సెల్ఫీలు పెట్టాలని సూచన