Talasani Srinivas: అంబర్పేట్ లో తలసాని.. కాలేరు వెంకటేష్ కి మద్దతుగా ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani Srinivas: హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గం అభ్యర్థి కాలేరు వెంకటేష్ కి మద్ధుతుగా బాగ్ అంబర్పేట్ డివిజన్ లో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం చేపట్టారు. అంబర్ పేట నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాలు కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంబర్ పెట్ నా అడ్డా అంటాడు కదా, మరి ఎక్కడ కనిపిస్తాలేడు అని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి నియోజకవర్గాన్ని విడిచి పెట్టి ఎందుకు పారిపోయావు చెప్పాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి కాలేరుని గెలిపించాలని ప్రజలను కోరారు. పనిచేసే అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజలను కాపాడుకున్నామని చెప్పారు. ఢిల్లీ నుంచి వస్తున్నారు.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారని తెలిపారు. ఎలక్షన్ కాగానే 400 రూపాయలుకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం, సన్న బియ్యం ఇస్తాము, సౌభాగ్యలక్ష్మి వస్తుంది అని పేర్కొన్నారు.
మేనిఫెస్టో లో ఇంకో లక్ష ఇల్లు కడతామని సీఎం కేసీఆర్ పెట్టారన్నారు. అందరికి డబల్ బెడ్ రూంలు వస్తాయని తెలిపారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. అంబర్ పెట్ లో బస్తీ దవఖానాలను పెద్ద ఎత్తున్న ఏర్పాటు చేసామన్నారు. కిషన్ రెడ్డి నీ పార్లమెంట్ పరిధిలో ఎక్కడైనా ఒక్క లక్ష రూపాయిలు పని చేసావా? అని ప్రశ్నించారు. రెండు సీట్లు గెలవని పార్టీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బిసిలకు టిక్కెట్లు ఇస్తామని మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లకి టికెట్ కేటయింపు చేయడమే రాదని అన్నారు. దిక్కు దివాన్ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి మూడు నెలలు ముందు అభ్యర్థులను ప్రకటించారన్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీ సఫా అయిపోయిందని, ఇక్కడ కాలేరు వెంకటేష్ బంపర్ మెజారిటీ తో గెలవనున్నారని తెలిపారు.
Anantapur: అనంతపురంలో దారుణం.. మ్తెనర్ బాలిక హత్య.. ఎవరు చంపారంటే..!
Also Read
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
తాజావార్తలు
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!