Southern Zonal Council: తెలంగాణ లేవనెత్తిన అంశాలివే.. ఆ సమస్యలు త్వరలో పరిష్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Home Minister Mahmood Ali Asked To Solved These Issues On Southern Zonal Council: శనివారం తిరువనంతపురంలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ.. పలు అంశాలను లేవనెత్తారు. విభజన సమస్యల్ని త్వరగా పరిష్కరించాలని కోరారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్ ప్రకారం.. కృష్ణా నదీ జలాల్లో హక్కు వాటాలో భాగంగానే తాము పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ (ఎల్ఐఎస్), నక్కలగండి ఎల్ఐఎస్ శ్రీశైలం రిజర్వాయర్ ప్రాజెక్టుల్ని చేపట్టామని అన్నారు. ఈ విషయంలో కర్ణాటకకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎల్ఐఎస్ డీపీఆర్ను తాము ఇప్పటికే సీడబ్ల్యూసీకి సమర్పించామన్నారు. నక్కలగండి ఎల్ఐఎస్ డీపీఆర్ తయారీ ప్రస్తుతం తుది దశలో ఉందని, అది పూర్తైన వెంటనే సీడబ్ల్యూసీకి సమర్పిస్తామని చెప్పారు. అప్పుడే కర్ణాటక ముఖ్యమంత్రి కలగజేసుకొని.. ఆ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అయితే.. ఈ సమస్యను అపెక్స్ కౌన్సిల్ ముందు ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు.
అనంతరం.. విద్యుత్ బకాయిల విషయాన్ని మహమూద్ అలీ ప్రస్తావించారు. ఏపీ పవర్ యుటిలిటీస్ నుంచి తెలంగాణ పవర్ యుటిలిటీస్కు రూ.17,828 కోట్లు రావాల్సి ఉందని.. కానీ తెలంగాణకు చెల్లించాల్సిన మొత్తాలను పరిగణనలోకి తీసుకోకుండా విద్యుత్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అలాగే.. ఏపీ భవన్, న్యూఢిల్లీ ఆస్తుల విభజన సమస్య.. ఇరు రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే త్వరలో పరిష్కారమవుతుందని కౌన్సిల్కు వెల్లడించారు. విభజన చట్టంలోని కొన్ని నిబంధనలు తెలంగాణకు అనుకూలంగా, మరికొన్ని ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా ఉన్నాయన్నారు. అయితే.. చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అనుసరించిన విధానాన్ని అధ్యయనం చేయాలని అమిత్ షా సూచించారు. ఇక ఇదే సమయంలో.. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల కేసుల విచారణ అంశంలో తెలంగాణ ప్రభుత్వం పురోగతి సాధించిందని కేంద్ర హోంమంత్రి ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఈ విషయంలో మార్గనిర్దేశం చేయాలని వెల్లడించారు.
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మహమూద్ అలీ.. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ, తక్కువ వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో ఒకటిగా అవతరించిందన్నారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 2014-15లో 4.1 శాతం ఉంటే.. 2021-22లో 4.9 శాతానికి పెరిగిందన్నారు. ఎన్నో వినూత్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో తెలంగాణ ముందున్నది పేర్కొన్నారు. 24 గంటలపాటు నిరంతరంగంగా విద్యుత్తును అందించడం, రైతులకు పెట్టుబడి మద్దతు సహా ఎన్నో కార్యక్రమాలతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని ఉందన్నారు. ఇక ఈ సమావేశం నిర్వహించినందుకు గాను అమిత్షాకు, అద్భుతమైన ఏర్పాట్లు చేసిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు ధన్యవాదాలు తెలియజేశారు.
తాజావార్తలు
-
BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
-
NSE Trading Hours Change: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయం మార్పు.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన!
-
Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
-
Lashkar-e-Taiba: భారత్ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
-
Ducati Collezione 100: డుకాటి ‘Collezione 100’ స్పెషల్ ఎడిషన్ బైక్స్.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..