NTV Telugu Site icon

తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు… 

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.  మరణాల సంఖ్య రోజుకు 50కి పైగా నమోదవుతున్నాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.  రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.  మే 8 వ తేదీతో కర్ఫ్యూ సమయం పూర్తవుతుంది.  అయితే, ఈరోజు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  తెలంగాణలో నైట్ కర్ఫ్యూ సమయం పొడిగించాలని ఆదేశించింది.  వీకెండ్ లాక్ డౌన్ పై ఎందుకు నిర్ణయం తీసుకోవాలని, ఈనెల 8 కంటే ముందే నైట్ కర్ఫ్యూ పై నిర్ణయం ప్రభుత్వాన్ని ఆదేశించింది.  వీకెండ్ లాక్ డౌన్ పై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించింది.