కరోనా మహమ్మారి బారినపడి మృతిచెందినవారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. కోవిడ్ సోకి మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపింది.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధుల నుంచి ఈ పరిహారం అందజేయనుండగా.. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది తెలంగాణ సర్కార్.. ఇక, కోవిడ్ డెత్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.. మృతుల కుటుంబ సభ్యుల ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ దరఖాస్తులను ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించి అర్హులైన వారికి పరిహారం అందజేస్తారని తెలిపింది.. మృతుల కుటుంబ సభ్యుల నుంచి దరఖాస్తు అందిన 30 రోజుల్లో అర్హులైన వారికి, ఆధార్తో లింకు ఉన్న బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేయనున్నట్టు వెల్లడించింది.
కోవిడ్ మృతులకు ఎక్స్గ్రేషియా.. తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు

Covid 19