Site icon NTV Telugu

తెలంగాణలో కొత్త‌గా 140 క‌రోనా కేసులు

తెలంగాణలో కరోనా రోజువారి కేసులు క్ర‌మ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26,947 శాంపిల్స్‌ పరీక్షించగా… 140 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఈరోజు క‌రోనా కార‌ణంగా ఇద్ద‌రు మ‌ర‌ణించారు.

ఇదే సమయంలో 186 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,80,553 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,73,033 కు పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 4,267 కు చేరినట్టు బులెటిన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,499 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Exit mobile version