తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా కిందికి దిగుతున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 917 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 10 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 1,006 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,23,510కు చేరగా.. రికవరీ కేసులు 6,06,461కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,661గా ఉంది.. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 97.26 శాతంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13,388 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 1,09,802 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని బులెటిన్లో పేర్కొంది సర్కార్.
తెలంగాణ కరోనా అప్డేట్..

COVID