Site icon NTV Telugu

తెలంగాణ కరోనా అప్‌డేట్‌

Covid 19

తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 715 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కగా.. మరో నలుగురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 784 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్‌.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,35,320కు చేరగా… రికవరీ కేసులు 6,21,541కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతిచెందనవారి సంఖ్య 3,751కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10,028 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఒకే రోజు 1,13,069 శాంపిల్స్ పరీక్షించినట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 76 కేసులు నమోదు కాగా.. ఖమ్మంలో 68, నల్గొండలో 54, కరీంనగర్‌లో 52 కేసులు అత్యధికంగా వెలుగుచూశాయి.

Exit mobile version