NTV Telugu Site icon

COVID 19: తెలంగాణలో భారీగా తగ్గిన కేసులు

తెలంగాణలో కరోనా రోజువారి పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 41,310 శాంపిల్స్‌ పరీక్షించగా.. కొత్తగా 453 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 1,380 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారిఉ.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,746 యాక్టివ్‌ కేసులు ఉండగా… మొత్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,85,596కు, రికవరీ కేసులు 7,74,742కు పెరిగాయి.. మరోవైపు కోవిడ్‌ మృతుల సంఖ్య 4,108గా ఉంది.. రాష్ట్రంలో రికవరీ రేటు 98.62 శాతానికి పెరిగినట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం..

Read Also: Delhi: ఐఈడీ బాంబుల కలకలం