NTV Telugu Site icon

తెలంగాణ కోవిడ్‌ అప్‌డేట్‌

COVID 19

COVID 19

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా కిందికి దిగివస్తున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్‌ బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 1,07,472 శాంపిల్స్‌ను పరీక్షించగా 591 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 643 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,45,997కు పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 6,33,371కు చేరింది.. ఇక, కోవిడ్‌తో ఇప్పటి వరకు 3,807 మంది కన్నుమూశారు.. మరోవైపు రాష్ట్రంలో రికవరీ రేటు 98.04 శాతంగా ఉందని తెలిపింది ప్రభుత్వం.. ప్రస్తుతం 8,819 యాక్టివ్‌ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని పేర్కొంది. ఇక తాజా కేసుల్లో అత్యధికంగా కరీంనగర్‌లో 75 కొత్త కేసులు వెలుగు చూడగా… జీహెచ్‌ఎంసీలో 68, ఖమ్మంలో 58, వరంగల్‌ అర్బన్‌లో 51 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.