NTV Telugu Site icon

గుప్తనిధుల కోసం విగ్రహం ధ్వంసం

నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని బాగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలు జిల్లాలో కలకలం రేపింది. గుప్తనిధుల కొరకు దేవతామూర్తి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ పూజారి సోన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. గుప్తనిధుల కోసమే విగ్రహాల ధ్వంసం చేసినట్లు తెలుస్తుందని ఎస్సై పేర్కొన్నారు.