MMTS: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MMTS: హైదరాబాద్ నగర వాసులు చాలా మంది ఎంఎంటీఎస్ ట్రైన్లలో ప్రయాణిస్తున్నారు. అయితే మెట్రో అందుబాటులోకి రావడంతో ఎంఎంటీఎస్ ట్రైన్లలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా కాస్త తగ్గింది. అయితే మెట్రో ట్రైన్లు మాదిరిగానే 24గంటలు ఎంఎంటీఎస్ అందుబాటులో ఉండవు.. ఎంఎంటీఎస్ చివరి సమయం అర్ధరాత్రి 10.30 వరకు మాత్రమే నడుస్తాయి. దీంతో 10.30 ఎంఎంటీఎస్ మిస్ అయితే.. ప్రయాణికులకు నిరాశే ఎదురవుతుంది. దీంతో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఎంఎంటీఎస్ అధికారులు శుభవార్త చెప్పారు. మెట్రో ట్రైన్ మాదిరిగానే.. ఎంఎంటీఎస్ ట్రైన్లు కూడా అర్ధరాత్రి వరకు నడుస్తాయని ప్రకటించింది.దీంతో ఎంఎంటీఎస్ ప్రయాణికులకు ఆనందం వ్యక్తం చేశారు. ఇక నుంచి ట్రైన్లు రాత్రి 10.30 వరకే అన్న బాధలు తప్పే ఛాన్స్ ఉండనుంది. అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లు నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే అలోచిస్తున్నట్లు సమాచారం.
Read also: Anchor Pradeep: ప్రదీప్ ఏంటి ఇలా మారిపోయాడు..? న్యూ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Also Read
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
కాగా.. హైదరాబాద్ నగరం నుంచి విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతికి నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు అనుగుణంగా ఎంఎంటీఎస్ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వెల్లడించారు. విశాఖ, తిరుపతి, బెంగళూరు నుంచి నగరానికి వచ్చే వందేభారత్ రైళ్లు రాత్రి 11 గంటల తర్వాత వస్తున్నాయని జీఎం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. నగరంలో ప్రజా రవాణా లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. విజయవాడ-లింగంపల్లి మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కూడా రాత్రి 10.30 తర్వాత సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు. కానీ. లింగంపల్లి వరకు వెళ్తే.. అన్ని స్టేషన్లలో ఆగదు. కాబట్టి ఈ సమయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని రైల్వే జీఎం వెల్లడించారు. అంతే కాకుండా ఉదయం 4 గంటల నుంచి లింగంపల్లి, ఫలక్నుమా, హైదరాబాద్ నుంచి ఎంఎంటీఎస్ చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే జీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మెట్రో మాదిరిగానే ఎంఎంటీఎస్ ట్రైన్లు కూడా రాత్రి వేళ్లల్లో అందుబాటులోకి వస్తే రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Anchor Pradeep: ప్రదీప్ ఏంటి ఇలా మారిపోయాడు..? న్యూ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే ధన నష్టం తప్పదు.. వాస్తు ఏం చెబుతోంది..?
-
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
-
North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!