NTV Telugu Site icon

సుప్రీంకోర్టుకు చేరిన దిశ కమిషన్ నివేదిక

సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సుప్రీం కోర్టు సిర్పూర్కర్ కమిషన్‌ను నియమించిన సంగతి తెల్సిందే.. ఈ ఎన్‌కౌంటర్‌ పై అప్పట్లో ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ కమిషన్‌ 47 రోజుల్లో 57 మంది సాక్షులను విచారించి నివేదికను రూపొందించింది. కమిషన్ విచారణలో ఫోరెన్సిక్‌ నివేదికలు, పోస్టు మార్టం వివేదికలు, ఫోటో గ్రాఫ్స్, వీడియో గ్రాఫ్స్‌తో పాటు వివిధ డాక్యుమెంటరీలను ఈ కమిషన్‌ సేకరించింది. కాగా దిశ ఎన్‌కౌంటర్‌లో 19-2019 క్రైమ్ నెంబర్ 784 నిందితుల గా ఉన్న జోల్లు శివ, నవీన్, మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నెకేశవులు ఎన్‌కౌంటర్ పై విచారణను కమిషన్‌ పూర్తి చేసింది. ఈ కమిషన్‌ 2019లో విచారణ చేపట్టింది. కానీ కరోనా కారణంగా విచారణ ఆలస్యమైందని కమిషన్‌ తెలిపింది. కాగా తాజాగా సుప్రీం కోర్టుకు సిర్పూర్కర్‌ కమిషన్‌ తన నివేదికను సమర్పించింది. దీనిపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read Also: కాంగ్రెస్‌లో చేరితే డీఎస్‌పై అనర్హత వేటు