Jagtial: దేశవ్యాప్తంగా దసరా, దీపావళి పండుగల సీజన్ ప్రారంభమైంది. ఈ పండుగలు వస్తే.. వ్యాపార సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక తగ్గింపులు ఇస్తారు. బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో ఫ్లిప్కార్ట్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లు కూడా ప్రత్యేక ఆఫర్ సేల్స్ను ప్రారంభించనున్నాయి. ఒక చీర కొనండి, మరో చీరను ఉచితంగా పొందండి, చీరలపై 50 శాతం తగ్గింపు వంటి పలు ఆఫర్లను కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు దుస్తుల దుకాణాలు ప్రకటిస్తున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ దుకాణాలు మొదలైనవి లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తాయి.
అయితే జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ షాపు యజమాని వినూత్నంగా ఆలోచించాడు. ఎలాంటి వస్తువులను అమ్మకానికి పెట్టకుండా దసరా మెగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నాడు. ఇందులో ఏదో విచిత్రం ఉందని అనుకుంటున్నారా? లక్కీ డ్రా వేయడంలో వింత ఏమీ లేదు కానీ ఆయన ప్రకటించిన బహుమతులు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా గొర్రె పిల్ల, ద్వితీయ బహుమతిగా మేక, తృతీయ బహుమతిగా మద్యం సీసా, నాల్గవ బహుమతిగా కోడి, ఐదో బహుమతిగా నాటు కోడి అని ఆయన ప్రకటించారు. ధర్మపురి పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మేనేజర్ మణికంఠ ఈ లక్కీ డ్రాను ప్రకటించారు. అయితే ఈ లక్కీ డ్రాలో పాల్గొనేందుకు రూ. 50 పెట్టి కూపన్ కొనడానికి షరతు. ప్రజలను మోసం చేసే ఉద్దేశం తమకు లేదని.. ఒక్కొక్కరికి 5 కూపన్లు మాత్రమే ఇస్తామని ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు విడుదల చేసిన బ్రోచర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘ఇవి కానుకలు బాసూ.. ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయి’ అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Minister MallaReddy: మా మ్యానిఫెస్టో అద్భుతంగా ఉంటుంది.. కేసీఆర్ పులి.. ఎవరికి భయపడే వ్యక్తి కాదు..