Mermaid Show Kukatpally: హైదరాబాద్ నగరంలో సాగర్ కన్యలు కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. కూకట్ పల్లిలోని మెట్రో ట్రక్ పార్కింగ్ ఏరియాలో ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ అండర్ వాటర్ టన్నెల్ లో జలకన్యలు సందడి చేస్తున్నాయి. కుకట్పల్లిలో దేశంలోనే మొట్టమొదటి నీటి అడుగున టన్నెల్ ఎగ్జిబిషన్, మెర్మైడ్ షో అద్భుతం అనిపించేలా ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రదర్శనలు ఇచ్చే ఆరుగురు యువతులను ఇక్కడి ఎగ్జిబిషన్లో ప్రదర్శించేందుకు నగరానికి తీసుకొచ్చారు. వీరంతా స్పెయిన్కు చెందిన వారు. మత్స్యకన్యలుగా పేరొందిన వీరు సాగర కన్య వేషధారణతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంతర్గత నీటి టన్నెల్లో ప్రత్యేక డ్రెస్లో ఆక్సిజన్ లేకుండా స్విమ్మింగ్ చేస్తున్నారు. వారి ఈ ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకు ముందు దుబాయ్, థాయిలాండ్ మరియు హాంకాంగ్ వంటి దేశాల్లో మాత్రమే ఈ ప్రదర్శనలు ప్రదర్శించబడ్డాయి.
Read also: TS Inter Supplemetary: నేటి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
అయితే దేశంలోనే తొలిసారిగా భాగ్యనగరంలో నిర్వహిస్తున్న ఈ షోకు సందర్శకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ ప్రదర్శన కోసం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 600 అరుదైన చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా ఇక్కడ స్కూబా డ్రైవింగ్ కూడా మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ ఎగ్జిబిషన్ మరో నెల రోజుల పాటు ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాగర కన్యల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. పూర్తి ప్రదర్శన కోసం టిక్కెట్ ధరలు ఇవ్వబడ్డాయి. పెద్దలకు రూ. 150, ఒక్కో చిన్నారికి రూ.120 అని నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తంగా నగరవాసులు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రత్యేక అనుభూతిని పొందవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
TS Inter Supplemetary: నేటి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు