Site icon NTV Telugu

సమంత పరువు నష్టం పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా

సమంత విడాకుల సందర్భంగా పలు యూ ట్యూబ్ ఛానల్స్‌ చేసిన వీడియోలు తప్పుడు ప్రచారాలు చేశాయని తమ పరువుకు భంగం వాటిల్లిందని సమంత కేసు వేశారు. కేసును కూకట్‌పల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోసారి వాదనలు వినిపించిన సమంత తరపు న్యాయవాది బాలాజీ ఈ సందర్భంగా మాట్లాడారు. సమంత ప్రతిష్ఠ ను దెబ్బతీసిన మూడు యూ ట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని కోర్టుకు తెలిపామన్నారు.


సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి పై ఇలా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చెయ్యడం సరైంది కాదు. తమ పిటీషన్ లో ఎక్కడ కూడా సమంత డబ్బులు అడగలేదన్నారు. కేవలం యూ ట్యూబ్ లింకులు మాత్రమే తొలగించాలని కోరుతున్నామని బాలాజీ చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా ..పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరామన్నారు. గతంలో శిల్పా శెట్టి కేసులో ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందన్నారు. ఈ రోజుతో వాదనలు పూర్తి చేసిన కూకట్‌పల్లి న్యాయస్థానం తీర్పును రేపటికి రిజర్వ్‌ చేసిందని సమంత తరపు న్యాయవాది బాలాజీ తెలిపారు.

Exit mobile version