Site icon NTV Telugu

మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అప్పాయిపల్లి స్టేజీ సమీపంలో 167వ నంబర్ జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీడీవో అటెండర్ విజయరాణి, ఆటో డ్రైవర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ జ్యోతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Read Also: యాదాద్రిలో ఇక సేవలు ప్రియం.. ఉత్తర్వులు జారీ

గాయపడ్డ వారిలో కంప్యూటర్ ఆపరేటర్ శ్రీలత, మరో అటెండర్ ఖాజా ఉన్నారు. వారిని స్థానికులు మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కావాలంటే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు

Exit mobile version