Revanth Reddy: కేసీఆర్.. భోజనానికి ముందు ఆత్మపరిశీలన చేసుకో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Questions KCR On Foods In Schools and Colleges: ఇటీవల పాఠశాలలు, కళాశాలల్లో భోజనాలు చేసి.. విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. హనుమకొండ జిల్లాలోని మహాత్మా జోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత నీరు, ఆహారం కారణంగా ఎనిమిది మంది విద్యార్థులు ఆసుపత్రిపాలయ్యారు. తాజాగా పప్పులో వానపామునే వడ్డించే ఘటన తెరమీదకొచ్చింది. రాత్రి చేసిన కూరనే ఉదయం వడ్డించడం, కడగని పాత్రల్లోనే భోజనాలు చేయడం లాంటి సంఘటనలు వెలుగు చూశాయి. ఫలితంగా.. వందలాది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విటర్ మాధ్యమంగా తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ‘పురుగలన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి?’ అని ఆయన ఫైరయ్యారు. కేసీఆర్కు భోగాలు తప్ప త్యాగాలేమీ తెలియవని.. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా? అంటూ నిలదీశారు. పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికోసమని ప్రశ్నించారు. భోజనం తినేముందు ఓసారి ఆత్మపరిశీలన చేసుకోమ్మని కేసీఆర్ని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ట్వీట్కు విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనల వార్తల్ని ప్రచురించిన ఓ వార్తా పత్రిక పేజీని షేర్ చేశారు.
Also Read
పురుగలన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి?
భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా?
పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి? భోజనం తినేముందు ఆత్మపరిశీలన చేసుకో కేసీఆర్. pic.twitter.com/itmuKie7oj
— Revanth Reddy (@revanth_anumula) July 30, 2022
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!