పంజాగుట్టలోని టాలీవుడ్ పబ్పై వెస్ట్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గతంలో పబ్ను హెచ్చరించిన యాజమాన్యం తీరు మార్చుకోలేదన్నారు. పోలీసులు దాడి అనంతరం మీడియాకు వివరాలను వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా టాలీవుడ్ పబ్ను నిర్వహిస్తున్నారన్నారు. పబ్లో వికృత చేష్టలకు పాల్పడుతున్న 9 మంది యువతులు, 34మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్టు వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాలీవుడ్ పబ్లో సమయం దాటిన తరువాత కూడా యువతీ, యువకులు అర్ధనగ్న డ్యాన్స్లు చేస్తున్నారని వెల్లడించారు.
ఇటీవల కాలంలో ఈ పబ్పై ఎక్సైజ్ మరియు పంజాగుట్ట పోలీసులు కలిసి దాడులు నిర్వహించి, పబ్కు నోటీసులు అందజేశామని అయినా పబ్ తీరు మార్చుకోలేదని పోలీసులు తెలిపారు. గతంలోను వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా టాలీవుడ్ పబ్ నిలిచిందన్నారు. ఇటీవలే పబ్కు వచ్చిన భార్యభర్తలపై కొందరూ దురుసుగా ప్రవర్తించడంతో పాటు పబ్సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు పబ్ను సీజ్ చేసినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.
