Site icon NTV Telugu

Panjagutta CI Durga Rao: పంజాగుట్ట సీఐ దుర్గారావు అరెస్ట్.. ఏపీలో అదుపులో తీసుకున్న పోలీసులు..

Panjagutta Ci Durgarao

Panjagutta Ci Durgarao

Panjagutta CI Durga Rao: హైదరాబాద్ పంజాగుట్ట సీఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రజాభవన్ వద్ద బారికేడ్ కొట్టిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ తప్పించుకున్న కేసులో సీఐ దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. ఇటీవల పంజాగుట్టలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అంతా సీపీకి బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే సస్పెన్షన్ తర్వాత సీఐ దుర్గారావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది లీకేజీలతో తప్పించుకుంటున్న దుర్గారావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సీఐ దుర్గారావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో సీఐ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Read also: OTT Movies : ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు.

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కలకలం రేపిన విషయం తెలిసిందే.. ఈ కేసులో దుర్గారావు నిందితుడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు పారిపోయేందుకు దర్గారావు సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో సీఐ దుర్గారావును హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. ఇదే కేసులో బోదన్ సీఐ ప్రేముకుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ్ కుమార్ షకీల్ కొడుకు బలవంతంగా విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. దుర్గారావును సస్పెండ్ చేసిన అనంతరం అతడు పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద షకీల్ కుమారుడు సోహెల్ కారును అతివేగంతో అతివేగంగా నడుపుతూ బారికేడ్లను ఢీకొట్టాడు. పంజాగుట్ సీఐ సోహెల్‌కు బదులుగా మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీంతో స్పందించిన పోలీసు అధికారులు సీఐని సస్పెండ్ చేశారు. సెక్షన్ 17 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.అప్పట్లో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒకరి మరణానికి కూడా సోహెల్ కారణమని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు షకీల్ ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండడంతో సోహెల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. బేగంపేట ప్రజాభవన్‌లో సోహెల్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కేసులో పోలీసులకు చిక్కారు. షకీల్ చెప్పిన మాటలు విని దుర్గారావు మొదటికే మోసం అయినట్లు తెలుస్తోంది.
Ambati Rambabu: జగన్ అర్జునుడు.. అభిమన్యుడు కాదు..

Exit mobile version