NTV Telugu Site icon

Gandhi Bhavan: నేడు గాంధీభవన్‌లో పీఏసీ కీలక భేటీ.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చర్చ?

Revanth Reddy

Revanth Reddy

Gandhi Bhavan: కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ గాంధీభవన్‌లో సమావేశం కానుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో ఎఫైర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ ఠాక్రేతో పాటు ముఖ్యనేతలంతా హాజరుకానున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నాహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. లేకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడంపై ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నామినేటెడ్ పదవులు కూడా అస్త్రంగా మారాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50కి పైగా నామినేటెడ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రాధాన్యాల ఆధారంగా దశలవారీగా వీటిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీనికితోడు దాదాపు ఆరు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కావడంతో.. వాటిని ఉపయోగించుకుని పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనలో నాయకత్వం ఉంది. ఆశావహులు ఎవరు? గతంలో ఎవరికి ఎలాంటి హామీలు ఇచ్చారు? ఏ ప్రాతిపదికన పోస్టులు ఇస్తారు? చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Read also: Lord Shiva Stotram: భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రాలు వింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి

అంతేకాకుండా రాష్ట్రంలో ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉంది, ఆయా స్థానాల్లో అవకాశం ఇస్తే ఏ సామాజిక వర్గాలకు మేలు జరుగుతుంది? కుల, మత ప్రాతిపదికన పదవులు ఇవ్వడంపై పీఏసీ చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి ఉమ్మడి జిల్లాలో పార్టీ గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల సీనియర్ నేతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అసంతృప్తులను బుజ్జగించి కీలక నేతలను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయా నేతలను సంతృప్తి పరచాల్సిన సమయం వచ్చింది. ఇది కాస్త ఇబ్బందికర పరిణామమని నేతలు చెబుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీనియర్లకు పదవులు ఇవ్వకుంటే ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, అదే జరిగితే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం పడుతుందని అంటున్నారు. మరోవైపు హామీ మేరకు పదవులు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని మరికొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Mexico: క్రిస్మస్ పార్టీలో కాల్పులు.. 16 మంది మృతి