Omega Hospital: నగర ప్రజలకు గుడ్ న్యూస్.. తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి చికిత్సలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omega Hospital: క్యాన్సర్ లో అగ్రగామిగా నిలిచిన ఒమేగా హాస్పిటల్స్, ప్రపంచ స్థాయి సదుపాయాలతో,అత్యంత అధునాతన టెక్నాలజీతో 500 లకు పైగా పడకల సామర్థ్యం గల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను నేడు గచ్చిబౌలిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోహన వంశీ సిహెచ్ మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి చికిత్సలు అందించాలనే ఏకైక లక్ష్యంతో గచ్చిబౌలిలో ఒమేగా హాస్పిటల్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న చాలా మంది రోగులకు గుండె, ఆర్థోపెడిక్, మూత్రపిండము, పల్మనరీ, న్యూరోలాజికల్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలకు ఇంటర్ డిసిప్లినరీ కేర్ అవసరమని, రోగుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని తాము సమగ్ర క్యాన్సర్ సంరక్షణను అందించడానికి, వివిధ సూపర్ స్పెషాలిటీల సేవలను ఐదు అంతస్తులలో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.వైద్య రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగడం ఎంతో అవసరం అన్నారు.
Read also: Keesara ORR Road Accident: రక్తసిక్తమైన కీసర ఓఆర్ఆర్ రోడ్డు.. ఇద్దరు స్పాట్ డెడ్
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ఒమేగా హాస్పిటల్ లో భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎ.ఐ)తో పనిచేసే రేడియేషన్ మెషిన్ ఎథోస్ (ETHOS)- విప్లవాత్మకమైన కొత్త థెరపీని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇది రోగి – కేంద్రీకృతంగా పనిచేస్తుందని వివరించారు. చికిత్సకు సంబంధించి ప్రారంభ ప్రణాళిక నుండి చివరి వరకు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తుందని తెలిపారు.ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎ.ఐ)తో పనిచేసే ఎథోన్ని ఉపయోగించి, పెట్/ఎంఆర్-గైడెడ్ అడాప్టివ్ రేడియోథెరపీని ప్రారంభించామని వెల్లడించారు.ఇది క్యాన్సర్ రేడియేషన్ చికిత్సలో ఒక విప్లవం అని పేర్కొన్నారు.ఈ విధానంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే వ్యాధిని పూర్తిగా విశ్లేషించి(చూడటం, ఆలోచించడం, ప్లాన్ చేయడం, చికిత్స అందించడం) చికిత్సను అందిస్తుందని వివరించారు.భారతదేశంలో డిజిటల్ పెట్(పిఇటి) ఎంఆర్, డిజిటల్ పెట్ (పిఇటి) సిటీ పరికరాలతో కూడిన అత్యుత్తమ న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ను ప్రారంభించిన మొదటి ఆసుపత్రి ఒమేగా హాస్పిటల్స్ అని డాక్టర్ మోహన వంశీ వెల్లడించారు.మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఐ.సి.యు. హై ఎండ్ క్యాథల్యాబ్ ఫెసిలిటీస్ తో మా అనుభవజ్ఞులైన క్రిటికల్ కేర్ టీమ్ 24 గంటలు అత్యవసర సేవలను అందించడానికి అందుబాటులో ఉంటామన్నారు.
Crooked Thief: బొమ్మతుపాకీ చూపించాడు.. అడ్డంగా బుక్కై తన్నులు తిన్నాడు
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?