Telangana Graduate MLC: రెండోరోజు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Graduate MLC: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రెండోరోజు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మూడో రౌండ్ లో ఎవరు ఆధిక్యంలో వస్తారన్నదానిపై ఆశక్తి నెలకొంది.
రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు వివరాలు:
Also Read
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
- Damodar Rajanarsimha: వైద్యుల సేవలు అమూల్యం.. డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కీలక సందేశం
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
* తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్)కు 34,575 ఓట్లు వచ్చాయి.
* రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్)కు 27,573 ఓట్లు వచ్చాయి
* ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ)కి 12,841 ఓట్లు వచ్చాయి
* స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 11,018 ఓట్లు వచ్చాయి
కాగా.. తీన్మార్ మల్లన్న 7,002 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత తొలి రౌండ్ కౌంటింగ్ వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ మద్దతు తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు, బీఆర్ఎస్ బలపరిచిన రాకేష్రెడ్డికి 28,540 ఓట్లు, బీజేపీకి చెందిన ప్రేమేందర్రెడ్డికి 11,395 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ ముగిసే సమయానికి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్లో మొత్తం 96,097 ఓట్లు పోలవ్వగా, వాటిలో 88,369 చెల్లుబాటు కాగా, 7,728 చెల్లలేదు. తొలి రౌండ్ పూర్తయిన తర్వాత రెండో రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నల్గొండలోని దుప్పలపల్లి గోదాములో కౌంటింగ్ కొనసాగుతోంది.
Read also: Pinnelli Ramakrishna Reddy: నేటితో ముగియనున్న పిన్నెల్లి మధ్యంతర బెయిల్ గడువు..
పట్టభద్రుల ఉప ఎన్నికలో మొత్తం 3 లక్షల 36 వేల ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తవుతుంది. పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం అంత తేలిక కాదనే అభిప్రాయాన్ని ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. అదే జరిగితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోందని ఆర్వో దాసరి హరిచందన తెలిపారు. ఈరోజు పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. గత నెల 27న పోలింగ్ జరగ్గా.. తాజాగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.
Left parties: కనుమరుగైపోతున్న కమ్యూనిస్టు పార్టీలు..
తాజావార్తలు
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
-
IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..