Site icon NTV Telugu

హిట్లర్ బతికుంటే కేసీఆర్ ను చూసి ఏడ్చేవాడు : ఎంపీ కోమటిరెడ్డి

తెలంగాణకు నది అంటేనే మూసి… దానిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అని చౌటుప్పల్ కాంగ్రెస్ కార్యాలయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మూసి ప్రక్షాళన కోసం రేపు పార్లమెంట్ లో మాట్లాడుతా అని తెలిపారు. హిట్లర్ బతికుంటే కేసీఆర్ ను చూసి ఏడ్చేవాడు. సీఎం వాసలమర్రి కి రెండు సార్లు వస్తే,ఎంపీ గా నాకు సమాచారం ఇవ్వలేదు .ఈ ప్రబుత్వం లో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీ లకు ప్రోటోకాల్ ఇవ్వరు. సీఎం పక్కన కూర్చుంటే ఆయన ఆడే అబద్ధాల కు నా పరువు పోతది. దళిత బంధు పెట్టిన రోజే కేసీఆర్ ఒడిపోయినట్టు. దళితులకు క్యాబినెట్ లో స్థానం లేదు గాని,దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కు తెలుసు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడీ కి పాత నల్లగొండ జిల్లా బౌండరీలు తెలుసా. జిల్లా మంత్రికి చెప్తున్న 3 నెలలు గడువులో సీఎం అపాయింట్మెంట్ దొరుకుతాదా. ఎంపీ స్థానంలో ఉండి 2 సం నుండి అపాయిట్ మెంట్ అడిగితే ఇంతవరకు దిక్కేలేదు అని పేర్కొన్నారు.

Exit mobile version