శంషాబాద్ మండలం పాలమాకుల కస్తూర్బా గురుకుల పాఠశాలను సందర్శించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. పాలమాకుల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు గత కొంతకాలంగా ఇబ్బందులకు గురవుతున్న తమను పట్టించుకునే నాధుడే లేడని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. అయితే విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు బాలికలతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి అన్ని గురుకులాలకు కావలసిన వసతులు అందించినప్పటికీ ఎక్కడో లోపం కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు ఆయన గుర్తించారు. అయితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు తమ ప్రభుత్వం రెడీగా ఉందని ఎక్కడ కూడా గురుకులంలో చదివే విద్యార్థులకు ఇబ్బందులు లేవని అన్నారు..
