Ponnam Prabhakar : ప్రతిపక్ష బాధ్యత మరిచి రాష్ట్రానికి నష్టం చేస్తోంది బీఆర్ఎస్
- బీఆర్ఎస్ వ్యవహారం ప్రజా విరుద్ధం
- బీజేపీతో బీఆర్ఎస్ రహస్య ఒప్పందం
- ఖర్గే సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ : మంత్రి పొన్నం
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రానికి తగినదే కాకుండా, నష్టం కలిగించే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షం తన పాత్రను వదిలి, శత్రుదేశంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇవాళ గాంధీభవన్లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన, సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన సమయంలో బీఆర్ఎస్ మాత్రం కేంద్రంలోని బీజేపీతో ఢిల్లీలో మైత్రీ, రాష్ట్రంలో పట్టు పోట్లుతో ఉన్నట్టు బిహేవ్ చేస్తోందని విమర్శించారు. “తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం చేసారు?” అని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. ప్రజలకు నష్టమే కలిగించినందుకు ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చాయన్న మంత్రి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ను ప్రజలు పూర్తిగా ఖండిస్తారని వ్యాఖ్యానించారు.
Also Read
- CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
- TGSRTC Strike: నేడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? సమ్మెపై క్లారిటీ ఇచ్చిన జేఏసీ!
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
EX MLA Pedda Reddy: పోలీసులను అడ్డం పెట్టుకొని జేసీ రాజకీయాలు చేస్తున్నాడు..
బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని అస్థిరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని నెల రోజుల్లో పడేస్తామంటూ పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుంటే, ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ పాలన రాష్ట్రాన్ని అప్పులలో ముంచిందని, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా, తమ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో తగ్గట్లేదని స్పష్టం చేశారు.
ఇక జులై 4న జరిగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల నుంచీ భారీగా జన సమీకరణ చేయాలని సూచించారు. పార్టీలో కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవులు అందేలా త్వరలోనే దేవాలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు సహా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం.. పార్టీ సమన్వయంతో సంక్షేమ పథకాలను ప్రజల వరకు తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా, గాంధీభవన్లో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితరులు నివాళులర్పించారు.
EX MLA Pedda Reddy: పోలీసులను అడ్డం పెట్టుకొని జేసీ రాజకీయాలు చేస్తున్నాడు..
తాజావార్తలు
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
-
CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
-
LSG Unwanted IPL Record: మొన్ననే ఎంట్రీ ఇచ్చి.. అప్పుడే చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్న లక్నో!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?