Minister KTR: బీజేపీ నేతకు కేటీఆర్ ఫోన్.. ఆడియో లీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Talks With BJP Leader Jagannadham Audio Leaked: మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడం కోసం ప్రధాన పార్టీలన్నీ ఏ స్థాయిలో శ్రమిస్తున్నాయో అందరికీ తెలుసు! ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూనే.. ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామంటూ వాగ్ధానాలు చేస్తున్నారు. ఓటర్లను తమవైపుకు ఆకర్షించేందుకు చేయాల్సిన కసరత్తులు, ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ బీజేపీ నేతతో మంత్రి కేటీఆర్ ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ అవ్వడం సంచలనంగా మారింది. గట్టుప్పల్ బీజేపీ ఇన్ఛార్జ్ జగన్నాథంకు ఫోన్ చేసిన కేటీఆర్.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకు సహకరించాలని కోరారు.
ఆ ఫోన్ కాల్లో ఏముందంటే.. ‘‘ఈ ఒక్క మునుగోడు ఉప ఎన్నికలతో రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చేది లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం పోయేది లేదు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాల గురించి నాకంటే బాగా మీకే తెలుసు. ఆయన ఏనాడైనా నియోజకవర్గాన్ని పట్టించుకున్నాడా? ప్రజలను పట్టించుకున్నారా? అనే విషయాలను మీ అనుభవానికి నేను మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోనీ.. రాజగోపాల్ రెడ్డి ఏమైనా పాత ఆర్ఎస్ఎస్ మనిషో, పూర్తిస్థాయి బీజేపీ నేతనో అయ్యుంటే అది వేరే విషయం అయ్యేది. కేవలం తన అవసరాల కోసమే పార్టీ మారాడే తప్ప.. మోడీ మీదనో, ఇంకెవరి మీద ప్రేమతోనో మారలేదు. గట్టుప్పల్లో మీరు నాకు సహకరిస్తే.. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. నియోజకవర్గాన్ని కూడా దత్తత తీసుకుంటానని చెప్పా. నేను పని చేసే మీ సహకారాన్ని అడుగుతున్నానే తప్ప.. డొల్ల మాటలు చెప్పి అడగట్లేదు. దయచేసి మీ ఆశీర్వాదం కావాలి’’ అని కేటీఆర్ చెప్పారు.
Also Read
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ఇంకా ఏమన్నారంటే.. ‘‘నియోజకవర్గంలో మీ ఇన్ఫ్లూయెన్స్ చాలా ఉందని మావాళ్లు చెప్పారు. మీరొక్కరు సహకరిస్తే చాలు. మీ నియోజకవర్గంలో 79 వేల మందికి రైతుబంధు, 43 వేల మందికి పెన్షన్లు వస్తున్నాయి. మిషన్ భగీరథ కూడా వచ్చింది. ఇది నాకోసమో, మీకోసమో కాదు.. నియోజక అభివృద్ధి కోసమే సహకారం కోరుతున్నా. మీలాంటి వాళ్లు ఆశీర్వదిస్తే ఇంకా ఎక్కువ పని చేయాలని అనిపిస్తుంది’’ అని కేటీఆర్ చెప్పారు. మధ్యలో ఓసారి జగన్నాథ్ జోక్యం చేసుకొని.. రైతు బంధు పథకం పెద్ద రైతుల కంటే చిన్న రైతులకు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సంభాషణను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఫోన్లు చేస్తూ విపక్ష నేతలను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
A very desperate CMs son Rama Rao making phone calls to lure opposition leaders, ending up looking foolish.#Munugodu@bandisanjay_bjp@Arvindharmapuri@drlaxmanbjp@kishanreddybjp@Arvindharmapuri@trspartyonline@BJP4Telangana@toi@DeccanChronicle@htTweets@ntv@Tolivelugu pic.twitter.com/NrqjAIEoiM
— Konda Vishweshwar Reddy (@KVishReddy) October 18, 2022
తాజావార్తలు
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!