Site icon NTV Telugu

Minister Harish Rao: సిద్దిపేటలో కంటి పరీక్షలు చేయించుకున్న మంత్రి హరీశ్‌ రావు

Minister Harish Rao

Minister Harish Rao

Minister Harish Rao: అంధత్వం నుంచి విముక్తి అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనతో ప్రారంభించిన కంటి వెలుగు అద్భుతంగా కొనసాగుతోందని కొనియాడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కంటి వెలక్ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలెవరూ కంటిచూపు సమస్యలతో బాధపడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. పండుగ వాతావరణం నేపథ్యంలో ఇవాళ 50 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: Stray Dogs: రాష్ట్రంలో కుక్కల బెడద.. మునిసిపల్ శాఖ 13 పాయింట్స్ తో మార్గదర్శకాలు

గడిచిన 25 పనిదినాల్లో పరీక్షల సంఖ్య 50 లక్షల మార్కుకు చేరుకుంది. 25 పనిదినాల్లో ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయడం గొప్ప విషయం. ఆసుపత్రులకు జనం రావడం లేదని, ప్రభుత్వం మాత్రం పట్టణానికి తరలిస్తోందన్నారు. ఉచితంగా కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, అవసరం అయిన వారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నదని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమంగా రికార్డు సృష్టించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న 50 లక్షల పరీక్షల్లో 16 లక్షల మందికి కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తేలిందని వెల్లడించారు. 9,35,512 మందికి అక్కడికక్కడే రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 6,49,507 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం రెఫర్ చేయగా, 54,324 మందికి ఇంటి వద్ద పంపిణీ చేశారని మంత్రి వ్యాఖ్యానించారు.
Dog Bite: కుక్క కాటుకంటే దానిపట్ల నిర్లక్షమే ఎక్కువ ప్రమాదకరం

Exit mobile version