ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగుల, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఉపకార వేతనాల విడుదలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు హైదరాబాద్లోని అరణ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. ఆరు శాఖలకు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వాల్సిన 362.88 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.దీంతో పాటు మార్చి 31 వ తేదీలోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, విగలాంగుల, ఈబీసీ, మైనార్టీ శాఖల నుండి బిల్లులు అందలేదన్న కారణంతో ట్రెజరీ అధికారులు తిప్పిపంపడం జరిగిందని మంత్రి హరీశ్ రావు దృష్టికి రాగా దీనిపై ఆయన సమీక్ష జరిపారు.
Jaggareddy: సంచలన నిర్ణయానికి టైం ఉంది.. అది కూడా పార్టీ మంచి కోసమే..
ఇందుకు సంబంధించిన బిల్లులను సంబంధింత శాఖలు తిరిగి ట్రెజరీకి సమర్పించాలని, ఆ బిల్లులను వెంటనే ట్రెజరీ అధికారులు క్లియర్ చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. దీంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాల బీఆర్వోలను విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్ యోగితా రాణా, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.