NTV Telugu Site icon

జేఎన్‌టీయు విద్యార్ధుల‌కు మైక్రోసాఫ్ట్ బంప‌ర్ ఆఫ‌ర్ః అత్య‌ధిక వేత‌నంతో…

టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ కు జేఎన్‌టీయు కు చెందిన ముగ్గురు విద్యార్ధులు ఎంపిక‌య్యారు.  క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలో ముగ్గురు విద్యార్ధుల‌ను మైక్రోసాఫ్ట్ సంస్థ ఎంపిక చేసుకుంది.  సాయి అస్రిత్ రెడ్డి, స్పూర్తిరాజ్‌, మ‌హ్మ‌ద్ మూర్తుజాలు ఎంపికైన‌ట్టు ఆ టెక్ దిగ్గ‌జ సంస్థ తెలియ‌జేసింది.  సంవ‌త్స‌రానికి రూ.41 ల‌క్ష‌ల వేత‌నంతో వీరిని ఎంపిక చేసుకున్న‌ది.  జేఎన్‌టీయు నుంచి మైక్రోసాఫ్ట్‌కు ఎంపికైన వారిలో వీరిదే అత్య‌ధిక వేత‌నం కావ‌డం విషేషం.  మైక్రోసాఫ్ట్ సీఈవోగా స‌త్య నాదేళ్ల ఎంపిక‌య్యాక ఆ సంస్థ‌లో భార‌తీయుల‌కు ప్రాముఖ్య‌త పెరుగుతూ వ‌స్తున్న‌ది.  ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన టెక్ సంస్థ‌లు భార‌తీయుల‌కు పెద్ద‌పీట వేస్తున్నాయి. 

Read: చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా…?