Transfer of Inspectors: భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీ.. మొత్తం 104 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Transfer of Inspectors: రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీ చేపట్టారు.హైదరాబాద్ పరిధిలో 63 మంది, సైబరాబాద్ పరిధిలో 41 మంది బదిలీ అయ్యారు. మొత్తం 104 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ చేస్తునట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో భారీగా బదిలీలు జరిగాయి. 63 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ కాగా, 54 మంది అధికారులు స్థానికులు లేదా పార్లమెంటరీ నియోజకవర్గంలో మూడేళ్లుగా పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. వీరందరినీ మల్టీజోన్-2కి బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట కె.శ్రీనివాస రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో సైబరాబాద్, రాచకొండ, మల్టీజోన్-2 పరిధిలోని 46 మంది ఇన్ స్పెక్టర్లను హైదరాబాద్ కమిషనరేట్ కు బదిలీ చేశారు. వీరితో పాటు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లుగా (డీఐ) ఉన్న వారికి ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. దీంతో చాలా కాలంగా డీఐలుగా పనిచేస్తున్న వారికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ వో)గా అవకాశం దక్కింది.
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
Read also: Road Accident : ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, నలుగురికి సీరియస్
మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 41 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తాజాగా.. నగరంలో 71 మంది ఎస్ఐలు, ఏడుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చాదర్ ఘాట్ ఎస్ హెచ్ ఓ వై.ప్రక్షా రెడ్డిని మల్టీజోన్ 2కి, మారేడుపల్లి ఎస్ హెచ్ ఓ డి.శ్రీనివాసరావును ఎస్ బీకి అటాచ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎట్టకేలకు వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, భూవివాదాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఇన్స్పెక్టర్లు లొంగిపోయారు. సైబరాబాద్ పరిధిలో ఒకేసారి 16 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో చాలా మంది కీలకమైన పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు. మరికొద్ది రోజుల్లో మరో 10 మంది ఇన్ స్పెక్టర్లను తొలగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సిఫార్సులు, ఉల్లంఘనలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించడంతో ఇన్విజిలేటర్లు బదిలీ అయిన స్టేషన్లకు వెళ్లి బాధ్యతలు చేపడుతున్నారు.
Wine Shops: జీహెచ్ఎంసీలో సీసీటీవీ కెమెరాలు.. వైన్ షాపులు కవర్ అయ్యేలా ఏర్పాట్లు
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..