CM Revanth Reddy: ప్రతి టౌన్‌లో ‘మహిళా మార్ట్’లు ఏర్పాటు కావాలి

  • ఖమ్మం మహిళా మార్ట్‌కు మంచి ఆదరణ
  • రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణపై సీఎం రేవంత్ ఆకాంక్ష
  • మహిళల ఆర్థిక స్వావలంబనపై ప్రభుత్వ దృష్టి
  • ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్‌కు కొత్త వేదిక
Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో మహిళల స్వయం ఉపాధికి దోహదం చేసే విధంగా ఏర్పాటు చేసిన ‘మహిళా మార్ట్’ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మార్ట్‌లో స్థానిక మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ లభించడంతో, వ్యాపారం చురుగ్గా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అవకాశాలు విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన ట్విట్టర్ (X) ఖాతా ద్వారా స్పందించారు. ప్రజా ప్రభుత్వ సంకల్పం… అధికారుల కార్యచరణ… ఆడబిడ్డల ఆచరణకు… ప్రతిరూపం ఖమ్మంలో…దిగ్విజయంగా నడుస్తోన్న… ఈ ‘మహిళామార్ట్’. ఇందులో భాగస్వాములైన…ప్రతి ఒక్కరికి నా అభినందనలు. రాష్ట్రంలో… ప్రతి టౌన్ లో ఇటువంటి ‘మహిళా మార్ట్’ లు ఏర్పాటు కావాలి ఆకాంక్షిస్తున్నా.’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

×
×
Ad

మహిళా మార్ట్ ద్వారా మహిళలకు ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ సౌకర్యాలు, శిక్షణ కార్యక్రమాలు లభిస్తున్నాయి. ఈ మోడల్‌ను ఇతర పట్టణాలకు విస్తరించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.

Heavy Rains : అలుగులు పోస్తున్న పాలేరు, వైరా జలాశయాలు