Mahabubnagar: అమెరికాలో తెలంగాణ యువకుడు హత్యకు గురయ్యాడు.. పోలీసుల కాల్పుల్లో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.. అయితే, తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్ను పోలీసులు కాల్చి చంపారని.. పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు. కాగా, మహబూబ్నగర్ రామయ్య బౌలికి చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్.. డిసెంబర్ 2016లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి కాలిఫోర్నియాలోని శాంటా క్లారాకు వెళ్లాడు. ఆ యువకుడిని శాంటా క్లారా పోలీసులు కాల్చి చంపారు. మృతదేహం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలోని ఓ ఆసుపత్రిలో ఉందని తమకు తెలిసిందని.. తమ కుమారుడి మృతదేహాన్ని మహబూబ్నగర్ తీసుకురావడంలో సాయం చేయాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత కాన్సులేట్ ద్వారా సంప్రదింపులు జరపాలని అభ్యర్థించారు.
Read Also: Off The Record: డ్యామేజ్ కంట్రోల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!
కాగా, అమెరికా పోలీసుల చేతిలో మహబూబ్నగర్ యువకుడు హతం అయ్యాడు.. శాంటా క్లారాలో నిజాముద్దీన్(32) ను కాల్చి చంపారు పోలీసులు.. ప్లాట్ ఓనర్ తో ఘర్షణ సమయంలో నిజాముద్దీన్పై కాల్పులు జరిపారట పోలీసులు.. ఆ సమయంలో నిజాముద్దీన్ చేతిలో కత్తి ఉందని.. అందుకే పోలీసులు కాల్పులు జరిపారని అధికారులు ప్రకటించారు.. కానీ, ఎందుకు తమ కుమారుడిపై పోలీసులు కాల్పులు జరిపారో స్పష్టతలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..