ములుగు కర్రిగుట్ట ఎన్కౌంటర్లో గాయపడ్డ జవాన్ను హైదరాబాద్కు తరలించారు. ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జవాన్ మధు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్లో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు. గ్రేహౌండ్స్ జవాన్ మధును కలిసేందుకు భారీ స్థాయిలో యశోద ఆస్పత్రికి చేరుకుంటున్న పోలీసు అధికారులు.ఇంటలిజెన్స్, గ్రేహౌండ్స్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు. వీరితో పాటు ఐజీ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ ఛీఫ్ అనిల్ కుమార్ జవాన్ణ మధు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మధు త్వరలో కోలుకోవాలని వారు చెప్పారు.
Read Also: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ..ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు
కాగా తెలంగాణ,చత్తీస్ఘడ్ సరిహద్దుల్లోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీప్రాంతంలో మావోయిస్టులు , పోలీసులకు తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో . నలుగురు మావోయిస్టుల మృతి చెందగా వీరిలోవెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ డీవీసీ ఎం సుధాకర్ ఉన్నారు. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మధుకు గాయాలయ్యాయి. ఎల్ ఎం జి, ఎస్ ఎల్ ఆర్ ను పోలీసలు స్వాధీనం చేసుకున్నారు.
