NTV Telugu Site icon

Liquor: మందుబాబులకు అలెర్ట్.. 24 గంటల పాటు మద్యం షాపులు బంద్‌

హైదరాబాద్‌లోని మందు బాబులకు అలెర్ట్.. 24 గంటల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి… హనుమాన్ జయంతి శోభాయాత్ర నిర్వహించేందుకు భాగ్యనగరం సిద్ధమైంది.. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రేపు గౌలిగూడ రాంమందిర్ నుండి తాడుబందు హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలోసైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలు విధించారు పోలీసులు.. రేపు ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్స్, రెస్టారెంట్స్, కల్లు దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.. నిబంధలు అతిక్రమిస్తే కఠినంగా వ్యహరిస్తామని హెచ్చరించారు సైబరాబాద్‌ సీపీ.

Read Also: CM KCR : ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాకే సమస్యను పరిష్కరించారు