బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమిస్తున్నారు. రీజినల్ లేబర్ కమిషనర్ తో ముగిసిన సింగరేణి కార్మిక సంఘాల చర్చలు జరిగాయి. అయితే, సింగరేణి కార్మిక సంఘాల చర్చలు కొలిక్కిరాలేదని తెలుస్తోంది. ఈనెల 21న మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంబంధించి 4 బ్లాకు లు ప్రైవేటుకు అమ్ముతాం అని చెప్పడం తో నవంబర్ లో సమ్మె నోటీస్ ఇచ్చామన్నాయి కార్మిక సంఘాలు.
అప్పుడు మూడు రోజులు సమ్మె చేశామని ఆసమ్మె ఫలప్రదం కాలేదన్నారు. 12 డిమాండ్ లతో ఇచ్చిన సమ్మె నోటీస్ తో చర్చలు జరిపారు.రాష్ట్రంలో ఉన్న నాలుగు బొగ్గు గనులను సింగరేణి కే కేటాయించాలని యాజమాన్యానికి తేల్చి చెప్పాయి సింగరేణి కార్మిక సంఘాలు. తమ డిమాండ్ లు పరిష్కారం కాకపోతే మెరుపు సమ్మెకు పిలుపు నిస్తామన్నాయి. సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని 6 జాతీయ కార్మిక సంఘాలతో కోల్ ఇండియా మినిస్ట్రీకి త్వరలో వినతి పత్రం ఇవ్వనున్నారు కార్మిక సంఘాల నేతలు.