Kishan Reddy: బషీర్ బాగ్ ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమం.. పాల్గొన్న కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: హైదరాబాద్ లోని బషీర్ బాగ్ అమ్మవారి ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొరు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాలు స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బషీర్ బాగ్ అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఉదయం 11 గంటలకు గౌరవ ఫిజి ఉప ప్రధానమంత్రి, పర్యాటక, పౌర విమానయాన శాఖ మంత్రి విలియమ్ గవోకాతో బంజారాహిల్స్ తాజ్ కృష్ణ ద్వైపాక్షిక చర్యల్లో పాల్గొంటారు.
Read also: Pakistan : కిలో ఉల్లి 250రూపాయలు.. ఎక్కడంటే ?
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
‘మన సంకల్పం.. వికసిత్ భారత్’ అంటూ ప్రజలకు ప్రతిజ్ఞ చేశారు. వికసత్ భారత్ లో భాగంగా.. నిన్న కాచిగూడ, నింబోలి అడ్డాలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం చేపట్టిన వికాసిత్ భారత్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఈ స్పందన చూస్తుంటే మోదీ మూడోసారి ప్రధాని అవుతారని అనిపిస్తోందని అన్నారు. ప్రతి ఇంటికి మూత్రశాలలు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత కేంద్రంలోని బీజేపీకే దక్కుతుందన్నారు. కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం, కరువు పనులు తదితర కార్యక్రమాలను ప్రజలకు చెప్పడం లేదన్నారు.
అందుకే తమ ప్రభుత్వం ప్రజల కోసం ఎలాంటి పథకాలు తీసుకొచ్చిందో తెలుసుకునేందుకు వికాసిత్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బీజేపీని ఓడించే శక్తి దేశంలో ఏ పార్టీ లేదని, రానున్న ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించి కేంద్రంలో అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలో ‘మా సంకల్పం అభివృద్ధి చెందిన భారత్’ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించి, బ్రోచర్లను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
India Most Polluted Cities: భారతదేశంలో అత్యంత కాలుష్య నగరాలు ఏవో తెలుసా?
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!