Kishan Reddy: పంచె కట్టులో కిషన్ రెడ్డి.. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు..
- పార్లమెంట్ లోకి పంచె కట్టులో కిషన్ రెడ్డి..
- తెలుగు తనం ఉట్టి పడుతూ కిషన్ రెడ్డి ఎంట్రీ..
- సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి తెలుగులో లోక్సభలో ప్రమాణ స్వీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: పార్లమెంట్ లోకి పంచె కట్టులో కిషన్ రెడ్డి అడుగుపెట్టారు. తెలుగు తనం ఉట్టి పడుతూ కిషన్ రెడ్డి పార్టమెంట్ లో ప్రవేశించారు. అనంతరం సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి తెలుగులో లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం నేతృత్వంలో 18వ లోక్సభ జరుగుతోంది. సమావేశం ప్రారంభమైన తొలిరోజు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తిహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలిచిన ఎంపీ కిషన్రెడ్డి, కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రులిద్దరూ తెలుగులోనే ప్రమాణం చేశారు. తొలుత ప్రధాని మోడీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
Read also: KTR: పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణం చేశారు. కానీ కిషన్ రెడ్డి మాత్రం పార్లమెంట్ లో పంచె కట్టులో కనిపించారు. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి తెలుగులో లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. తొలిరోజు 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మిగిలిన వారు రేపు (మంగళవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తి కానుంది. 27న రాజ్యసభ కూడా ప్రారంభం కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒకే రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరోవైపు కేరళలోని వాయనాడ్ స్థానానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వాయనాడ్తో పాటు రాయ్బరేలీ నుంచి రాహుల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయనాడ్ సీటును వదులుకుని రాయ్బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు.
Paytm Payments Bank: పేటీఎం పేమెంట్ బ్యాంక్ యూజర్స్ కి అలర్ట్.. త్వరలో కొన్ని ఖాతాలు డీయాక్టివేట్..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!