Kishan Reddy: పంచె కట్టులో కిషన్ రెడ్డి.. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు..
- పార్లమెంట్ లోకి పంచె కట్టులో కిషన్ రెడ్డి..
- తెలుగు తనం ఉట్టి పడుతూ కిషన్ రెడ్డి ఎంట్రీ..
- సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి తెలుగులో లోక్సభలో ప్రమాణ స్వీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: పార్లమెంట్ లోకి పంచె కట్టులో కిషన్ రెడ్డి అడుగుపెట్టారు. తెలుగు తనం ఉట్టి పడుతూ కిషన్ రెడ్డి పార్టమెంట్ లో ప్రవేశించారు. అనంతరం సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి తెలుగులో లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం నేతృత్వంలో 18వ లోక్సభ జరుగుతోంది. సమావేశం ప్రారంభమైన తొలిరోజు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తిహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలిచిన ఎంపీ కిషన్రెడ్డి, కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రులిద్దరూ తెలుగులోనే ప్రమాణం చేశారు. తొలుత ప్రధాని మోడీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
Read also: KTR: పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!
Also Read
- Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
- Jagadish Reddy : పవన్ వ్యాఖ్యలు ఐటెం సాంగ్స్లాంటివే.. జగదీష్ రెడ్డి సెటైర్లు.!
- OTR : జూబ్లీ హిల్స్ BRSలో మూడు ముక్కలాట! కేటీఆర్కే తలనొప్పిగా మారిన హాట్ సీట్?
- Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణం చేశారు. కానీ కిషన్ రెడ్డి మాత్రం పార్లమెంట్ లో పంచె కట్టులో కనిపించారు. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి తెలుగులో లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. తొలిరోజు 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మిగిలిన వారు రేపు (మంగళవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తి కానుంది. 27న రాజ్యసభ కూడా ప్రారంభం కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒకే రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరోవైపు కేరళలోని వాయనాడ్ స్థానానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వాయనాడ్తో పాటు రాయ్బరేలీ నుంచి రాహుల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయనాడ్ సీటును వదులుకుని రాయ్బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు.
Paytm Payments Bank: పేటీఎం పేమెంట్ బ్యాంక్ యూజర్స్ కి అలర్ట్.. త్వరలో కొన్ని ఖాతాలు డీయాక్టివేట్..
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్తో ఫంగస్కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!