Dengue Fever: జిల్లాలో డెంగ్యూ జ్వరాలు.. రెండు నెలల్లో 714 కేసులు
- కామారెడ్డి : జిల్లాలో విజృభిస్తున్న డెంగ్యూ జ్వరాలు..
- జిల్లా వ్యాప్తంగా 110 డెంగ్యూ కేసుల నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dengue Fever: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వర పీడితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో విష జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కరీంనగర్ జిల్లాలోనూ డెంగ్యూ జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రతిరోజూ వందలాది మంది విష జ్వరాల బారిన పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 110 డెంగీ కేసులు నమోదవుతున్నాయి. లింగంపేట మండలం మెంగారంలో అన్నం రాజు అనే వ్యక్తి డెంగ్యూతో మృతి చెందాడు. లింగం పేట సదాశివ నగర్ మండలాల్లో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగింది. దీంతో ప్రజలు భయంతో రోజులు గడుపుతున్నారు.
Read also: CM Biren Singh: “రాజీనామా ప్రసక్తే లేదు.. వచ్చే ఆరు నెలల్లో మణిపూర్ లో శాంతి ఖాయం!”
Also Read
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
ఇక నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కూడా వైరల్, డెంగ్యూ రోగులతో నిండిపోయింది. గతంలో 500 నుంచి 800 వరకు ఉన్న రోజువారీ ఓపీ ప్రస్తుతం వెయ్యి దాటుతుందంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. అధికారిక గణాంకాల ప్రకారం జూలై, ఆగస్టు నెలల్లో ఇప్పటివరకు 714 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇక మరోవైపు ఆసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేవు’… ఇది సర్కార్ దవాఖాన సిబ్బంది చెబుతున్న మాట కాదు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఇదే మాట వినిపిస్తోంది. సీజనల్ జ్వరాలతో ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేట్ ఆస్పత్రులు కూడా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి ఇంట్లో జ్వరపీడితులు, డెంగ్యూ బాధితులు ఉండడంతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రైవేట్లో కూడా పడకలు అందుబాటులో లేవు. దీంతో మళ్లీ కరోనా పరిస్థితి గుర్తుకు వస్తోంది. ఎక్కువగా వైరల్ ఫీవర్, డెంగ్యూ కేసులు వస్తున్నాయని ప్రైవేట్ దవాఖానల వైద్యులు చెబుతున్నారు.
17 Years of NTV Journey: ప్రతిక్షణం ప్రజాహితం.. ఎన్టీవీ 17 ఏళ్ల ప్రయాణం..
తాజావార్తలు
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!