Mallu Bhatti Vikramarka: ఇచ్చిన హామీ మేరకు ఈ పవర్ ప్లాంట్ స్థలంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు వచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కరీంనగర్ జిల్లా రామగుండం ధర్మల్ బీ పవర్ ప్లాంట్ ను మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పవర్ ప్లాంట్ గురించి అధికారులు మంత్రులకు వివరించారు. నేను పాదయాత్ర ఇక్కడ చేసినప్పుడు ప్లాంట్ ని చూసానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే పవర్ ప్లాంట్ ని పునః ప్రారంభం చేస్తానని మాట ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఈ పవర్ ప్లాంట్ స్థలంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు వచ్చామని తెలిపారు. సీఎం రేవంత్ తో చర్చించామన్నారు.
Read also: Heavy Rains: హైదరాబాద్ ను కమ్మేసిన వాన మబ్బులు.. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు..
800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త ధర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. అనంతరం రామగుండం నుంచి సింగరేణి ఆర్జీ 1 ఏరియా లోని మేడిపల్లి మిని ఓసిపి పరిశీలిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి రామగుండం సెక్టార్ 2 లో స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. మధ్యాహ్నం రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ లో అమృత్ 2.0 పథకం, టి.యూ.ఎఫ్.ఐ.డి.సి అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయనున్నారు. భట్టితో పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసి సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వున్నారు.
Rs.35 Lakh Stolen: హైదరాబాద్ లో దొంగల హల్ చల్.. రూ.35 లక్షలు దోపిడీ..