Doctors in Kamareddy: ఎలుకలు పేషెంట్ ని కొరికితే అది వైద్యుల తప్పా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctors in Kamareddy: కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. ఎలుకల దాడుల నేపథ్యంలో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ సస్పెన్షన్ పై వైద్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కామారెడ్డి ఆస్పత్రి వైద్యుల సస్పెన్షన్ పై నిరసనలు చేపట్టారు. దీనిపై వైద్యులు మాట్లాడుతూ.. ఎలుకలు పేషంట్స్ నీ కొరికితే వైద్యులను ఎందుకు బలి చేస్తున్నారు? అని ప్రశ్నించారు. శానిటేషన్ సిబ్బంది పై కాకుండా వైద్యులపై ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? అని మండిపడ్డారు. గత ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల మెడికల్ కాలేజీలు నిర్మాణం కన్నా ముందే షెడ్ లల్లో మెడికల్ కాలేజీ లను ప్రారంభించారని తెలిపారు. వంద పడకలున్న జిల్లా ఆస్పత్రి నీ మెడికల్ కాలేజీ చేశారని అన్నారు. వంద మందికి సరిపడా శానిటేషన్ స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు హాస్పటల్ లో బెడ్స్ సంఖ్య 350 కి పెంచారని తెలిపారు. గత ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నయని వైద్యులు మండిపడుతున్నారు. ఇవ్వాళ ఆరోగ్య శాఖ మంత్రి తో ప్రభుత్వ వైద్యుల చర్చలు ఉన్నాయని తెలిపారు. అయితే వెంటనే డాక్టర్ల పై విధించిన సస్పెన్షన్ నీ ఎత్తివేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.
Read also: Revenue Employees Pen Down: ఎమ్మార్వో రమణయ్య హత్య ఘటన.. రెవెన్యూ ఉద్యోగుల పెన్డౌన్..
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్తో దాడి
కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై సర్కార్ సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై వేటు వేసింది. ఐసీయూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ వసంత్ కుమార్, కావ్య తో పాటు సర్సింగ్ ఆఫీసర్ మంజులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విచారణ ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే వైద్యుల సస్పెన్షన్ నిరసనలు చేపట్టారు. ఎలా సస్పెన్షన్ చేస్తారు? అది ఎవరిది తప్పు? వైద్యులదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిరసనలతో రోగులు సరైన వైద్యం అందకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Vennela Kishore: సీరియస్ ఆపరేషన్ను కామెడీ చేసిన ఏజెంట్ ‘చారి 111’…
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!